విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు, ఎల్లుండి ముఖ్యమంత్రి రోశయ్య వైజాగ్ లోనే

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
విశాఖపట్నం: ముఖ్యమంత్రి కె.రోశయ్య విశాఖ జిల్లా పర్యటన ఖరారయ్యింది. ఈనెల 25,26 తేదీల్లో ముఖ్యమంత్రి కరువు, గిరిజన సంక్షేమంపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షించనున్నారు. తొలిరోజు న ఉత్తరాంధ్ర జిల్లాల పార్లమెంటుసభ్యులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, మార్కెట్‌ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

ఉత్తరాంధ్రా జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, వర్షపాతం, వ్యవసాయం, పశుగ్రాసం, మంచినీటి సమస్య, గ్రామీణ ఉపాధి హామీ పథకాలపై సిఎం సమీక్షించనున్నారు. అదే సమావేశంలో పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాలు, సంక్షేమ వసతిగృహాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మూడవ అంశంగా వైద్యంతోపాటు జిల్లాలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లాల వారీగా ముఖ్యమంత్రి చర్చించనున్నారు. వీటితోపాటు రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, గృహ నిర్మాణం, రోడ్ల విస్తరణ పనుల ప్రారంభంలో ఆయన పాల్గొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X