నివురు గప్పిన నిప్పులా వైయస్ జగన్

సమావేశం తర్వాత శాసనసభ్యులు కొండా సురేఖ, ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడిన తీరు జగన్ శిబిరం వెనక్కి తగ్గడానికి ఏ మాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల లోపే వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని కొండా సురేఖ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపించిందని ఆమె అన్నారు. దీన్ని బట్టి జగన్ శిబిరం ముఖ్యమంత్రి పదవిపై పట్టుదలతోనే ఉన్నట్లు అర్థమవుతోంది. జగన్ సిఎం కావాలని తాము ఇప్పటికీ కోరుకుంటున్నామని మరో శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. 90 శాతం మంది శాసనసభ్యులు జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం శుక్రవారం సిఎల్పీ సమావేశం ఏర్పాటుకు తాత్కాలికంగా కుదిర్చిన సంధే తప్ప దీర్ష కాలం సయోధ్య సాధ్యమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications