జైలులోనే దీక్ష కొనసాగిస్తున్నా: కెసిఆర్

జైలు నుంచి విడుదలయ్యాక పోరాటం ఉధృతం చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. తాను దీక్ష విరమించలేదని, పోలీసులే తనచేత దీక్ష విరమింపజేశారన్నారు. ఉద్యమంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించేంతవరకు ఎన్నాళ్లైనా జైలు జీవితం గడుపుతాన్నారు. బెయిలు దరఖాస్తు పెట్టలేదని, పెట్టనని కూడా ఆయన చెప్పారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తనపై ప్రజాగాయకుడు గద్దర్ చేసిన విమర్శలను కెసిఆర్ తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications