దుమారం: కెసిఆర్ దీక్ష కొనసాగింపు

K Chandrasekhar Rao
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష విరమణపై తీవ్ర దుమారం చెలరేగింది. కెసిఆర్ దీక్ష విరమణకు పలు వైపుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆంధ్రా పాలకులకు అమ్ముడుపోయి ఆయన దీక్ష విరమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కెసిఆర్ దీక్ష నాటకం ఆడారనే వ్యాఖ్యలు పెద్ద యెత్తున వచ్చాయి. దీంతో కెసిఆర్ ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో తిరిగి మంగళవారం ఉదయం తన దీక్షను ప్రారంభించారు. తనకు పెట్టిన సెలైన్ ను తీసేసి దీక్షను కొనసాగిస్తున్నారు.

సోమవారం సాయంత్రం పోలీసులు కెసిఆర్ ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పండ్ల రసం ఇచ్చి ఆయన చేత దీక్ష విరమింపజేశారు. వెంటనే కెసిఆర్ పై ప్రజా గాయకుడు గద్దర్ తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించారు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కెసిఆర్ కు వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు తనను గొర్రెలా తీసుకెళ్లారని, బలవంతంగా తన చేత దీక్ష విరమింపజేశారని ఆయన విమర్శించారు. గద్దర్ వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. అయినా నిరసనలు తగ్గలేదు. దీంతో ఆయన మంగళవారం ఉదయం తిరిగి తన దీక్షను ప్రారంభించారు. రాత్రి నుంచే ఆయన తిరిగి దీక్షను కొనసాగిస్తున్నారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

తాను ప్రతిఘటించిన దృశ్యాలను మీడియాకు విడుదల చేయకుండా తాను పండ్ల రసం తీసుకుంటున్న దృశ్యాలను విడుదల చేసి ప్రభుత్వం కుట్ర చేసిందని కెసిఆర్ అన్నారు. తన నిజాయితీని నిరూపించుకుంటానని ఆయన చెప్పారు. తాను బెయిల్ తీసుకోనని ఆయన చెప్పారు. తనను హైదరాబాద్ గానీ వరంగల్ గానీ మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+