వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంట తడి పెడుతున్న తెరాస నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శ్రేణుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ నేత కె. చంద్రశేఖర రావు ఆరోగ్య పరిస్థితిపై తెరాస నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెరాస నాయకులు కంట తడి పెడుతున్నారు. తీవ్రమైన విషాదంతో తెరాస నాయకుల్లో గంభీర వాతావరణ చోటు చేసుకుంది. తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు కంట పెట్టారు. దుఖ్కంతో ఆయన మీడియాతో కూడా మాట్లాడలేకపోయారు. తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తీవ్రంగా కంట తడిపెట్టారు. బలవంతంగా దుఖ్కాన్ని ఆపుకుంటున్నారు.

కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ఆందోళన నెలకొన్న వాతావరణంలోనే కెసిఆర్ దీక్ష విరమించినా తమకు అభ్యంతరం లేదని తెలంగాణ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జెఇసి) నాయకులు ప్రకటించారు. కెసిఆర్ దీక్ష విరమిస్తే బాగుండుననే వాతావరణం తెరాస వర్గాల్లో కూడా చోటు చేసుకుంది. గంభీర వాతావరణం నెలకొనడంతో భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి తెరాస పోలిట్ బ్యూరో అత్యవసరంగా సమావేశమవుతోంది. అందుబాటులో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు వెంటనే పార్టీ కార్యాలయానికి రావాలని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

కాగా, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కెసిఆర్ తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు విజ్ఞప్తి చేశారు. తాను ఈ విజ్ఞప్తి చేయడానికే బయటకు వచ్చానని ఆయన చెప్పారు. దండం పెడుతున్నానని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. కెటిఆర్ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉన్నట్లు కనిపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X