తెలంగాణపై సోనియాకు చెప్తా: విద్యార్థులతో డిఎస్
వరంగల్ లోని కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ ఇంటిని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ లో తెలుగుదేశం శాసనసభ్యుడు గంగుల కమలాకర్ రావు ఇంటిని విద్యార్థులు చుట్టుముట్టారు. ఎన్నికల సమయంలో తెలంగాణ అన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు మాట్లాడకపోవడమేమిటని విద్యార్థులు ఆయనను ప్రశ్నించారు. తెలంగాణ అంశాన్ని శాసనసభలో ప్రస్తావిస్తానని ఆయన చెప్పడంతో విద్యార్థులు సద్దు మణిగారు. హైదరాబాదులోని తార్నాకాలో గల గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కార్తిక రెడ్డి ఇంటిని కూడా విద్యార్థులు ముట్టడించారు. కాగా, తెలంగాణపై వెంటనే తేల్చాలని కోరుతూ పిసిసి ప్రధాన కార్యదర్శి నిరంజన్, కార్యదర్శులు సోనియాకు లేఖలు రాశారు.
Comments
hyderabad హైదరాబాద్ congress telangana తెలంగాణ students srinivas శ్రీనివాస్ konda surekha విద్యార్థులు కొండా సురేఖ కాంగ్రెసు
Story first published: Saturday, December 5, 2009, 14:22 [IST]