కెసిఆర్ కోమాలో లేరు: నిమ్స్ డైరెక్టర్
కెసిఆర్ ను పరామర్శించడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు వచ్చారు. బివి రాఘవులును నిమ్స్ వద్ద విద్యార్థులు చుట్టుముట్టి జైతెలంగాణ నినాదం చేయాలని పట్టుబట్టారు. ఆయన మెడపై తెరాస జెండా వేశారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్ర మూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్య కూడా కెసిఆర్ ను పరామర్సించారు. వెంటనే తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని పిసిసి సభ్యులు తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని కోరారు. కాగా, తెరాస ఇచ్చిన బంద్ పిలుపుకు అన్ని ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి.
Comments
Story first published: Saturday, December 5, 2009, 16:44 [IST]