నిమ్స్ లో ఐసియుకు కెసిఆర్ తరలింపు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లోకి మార్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఐసియులోకి మార్చినట్లు వైద్యులు చెప్పారు. ఆయన శరీరంలో పొటాషియం, సోడియం స్థాయిలు తగ్గిపోయాయని వైద్యులు చెబుతున్నారు. కెసిఆర్ ఆరోగ్యం పూర్తిగా ఏ క్షణంలోనైనా పూర్తిగా దెబ్బ తినవచ్చునని వైద్యులు చెబుతున్నట్లు తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

వైద్యం తీసుకోవడానికి కూడా కెసిఆర్ నిరాకరిస్తున్నారని, తనను బలవంత పెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. ఐసియుకు తరలించడం తప్ప మరో మార్గం లేదని అంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లో చిన్నపిల్లలు కూడా రోడ్ల మీదికి వచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణ అగ్ని గుండంగా మారుతోందని ఆయన చెప్పారు. రజకులు బట్టలు ఉతకడం లేదని, నాయీ బ్మాహ్మణులు క్షవరాలు చేయడం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు ఆగడం లేదని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కదలడం లేదని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+