హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీ రామారావు విగ్రహాలపై దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews

NTR
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలను లక్ష్యంగా ఎంచుకుంది. ఇప్పటి వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి, పొట్టి శ్రీరాములు విగ్రహాలనే ధ్వంసం చేసిన ఆందోళనకారులు ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహాలపై కూడా దాడి పూనుకుంటున్నారు. అంధ్ర పేర్లను తెలంగాణ పేర్లుగా మారుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్టీ రామారావు విగ్రహాలపై దాడులు జరిగాయి.

రంగారెడ్డి జిల్లా వికారాబాదులోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆందోళనకారులు నల్ల రంగు పూశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసిస్తున్నారు. తెలంగాణ స్థానికులకు ప్రయోజనం చేకూర్చడానికి 610ను జారీ చేసింది ఎన్టీ రామారావు ప్రభుత్వమేనని, తమ పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా ఉందని, ఈ స్థితిలో ఎన్టీఆర్ విగ్రహాలను లక్ష్యం చేసుకోవడం సరి కాదని వారంటున్నారు. హైదరాబాదులోని మౌలాలిలో ఎన్టీఆర్ విగ్రహంపై ఆందోళకారులు దాడి చేశారు. ఆ దాడిలో ఎన్టీఆర్ విగ్రహం చేయి విరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X