ఎన్టీ రామారావు విగ్రహాలపై దాడులు
రంగారెడ్డి జిల్లా వికారాబాదులోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆందోళనకారులు నల్ల రంగు పూశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసిస్తున్నారు. తెలంగాణ స్థానికులకు ప్రయోజనం చేకూర్చడానికి 610ను జారీ చేసింది ఎన్టీ రామారావు ప్రభుత్వమేనని, తమ పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా ఉందని, ఈ స్థితిలో ఎన్టీఆర్ విగ్రహాలను లక్ష్యం చేసుకోవడం సరి కాదని వారంటున్నారు. హైదరాబాదులోని మౌలాలిలో ఎన్టీఆర్ విగ్రహంపై ఆందోళకారులు దాడి చేశారు. ఆ దాడిలో ఎన్టీఆర్ విగ్రహం చేయి విరిగింది.
Comments
Story first published: Saturday, December 5, 2009, 12:26 [IST]