ఇద్దరు ఆత్మహత్య, మహిళ ఆత్మహత్యా యత్నం

వరంగల్ జిల్లాలో కూడా తాజాగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వర్మిడి గ్రామంలో నిరంజన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరెంట్ తీగెలు పట్టుకుని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వరంగల్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య మూడుకు చేరింది. ఇంతకు ముందు ప్రవీణ్, రాజేందర్ అనే యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంతో కరీంనగర్, వరంగల్ జిల్లాలు అట్టుడుకుతున్నాయి.












Click it and Unblock the Notifications