హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్స్ లో విద్యార్థుల ఆందోళన: ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రావడంతో విద్యార్థులో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఉదయం నుంచే విద్యార్థులు పెద్ద యెత్తున విద్యార్థులు చేరుకోవడం ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో విద్యార్థులు కెసిఆర్ ను ఉంచిన నిమ్స్ లోని మిలీనియం బ్లాక్ లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. వారిని అడ్డగించేందుకు పోలీసులు ప్రయత్నించారు.

పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పంజగుట్ట ప్రాంతంలో విద్యార్థుల సందడి విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీక్ష విరమించాలని విద్యార్థులు కెసిఆర్ ను కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. న్యాయవాదుల సంఘం, తెలంగాణ జర్నలిస్టుల పోరం కెసిఆర్ దీక్షకు మద్దతుగా ధర్నాలు చేశారు. వివిధ సంఘాలు స్వచ్ఛందంగా ఆందోళనలకు ముందుకు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X