నిమ్స్ లో విద్యార్థుల ఆందోళన: ఉద్రిక్తత
పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పంజగుట్ట ప్రాంతంలో విద్యార్థుల సందడి విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీక్ష విరమించాలని విద్యార్థులు కెసిఆర్ ను కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. న్యాయవాదుల సంఘం, తెలంగాణ జర్నలిస్టుల పోరం కెసిఆర్ దీక్షకు మద్దతుగా ధర్నాలు చేశారు. వివిధ సంఘాలు స్వచ్ఛందంగా ఆందోళనలకు ముందుకు వస్తున్నాయి.
hyderabad హైదరాబాద్ telangana తెలంగాణ students nims నిమ్స్ విద్యార్థులు tension కె చంద్రశేఖర రావు ఉద్రిక్తత k chandra sekhar rao
Story first published: Saturday, December 5, 2009, 15:43 [IST]