వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేను టిడిపిని సమర్థించలేదు: జగన్
తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు తెలంగాణ తీర్మానాన్ని సమర్థిస్తామని చెప్పడం వల్లనే కథ ఇంత దూరం వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ పార్టీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ముదాహమని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల వారు కలిసి మెలసి ఉండాలని తాను కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. తాను సభలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదని ఆయన చెప్పారు. తెలుగుదేశం తెలంగాణేతర సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న సమయంలో తమ పార్టీ సభ్యులు కూడా లేచారని, ఆ సమయంలో మాత్రమే తన వైఖరిని ప్రదర్శించానని ఆయన చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, December 15, 2009, 16:03 [IST]