వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపితో గొంతు కలిపిన వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీతో శృతి కలిపారు. లోకసభలో తెలంగాణపై గందరగోళం సృష్టించిన తెలుగుదేశం సభ్యులతో ఆయన శృతి కలిపారు. సమైక్యనినాదంతో కూడిన ప్లకార్డును ఆయన లోకసభలో ప్రదర్శించారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం లోకసభ సభ్యుల చెంతకు వెళ్లి వారిని అభినందించారు. దీన్ని కాంగ్రెసు వర్గాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. జగన్ తీరును కాంగ్రెసు ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ తప్పు పట్టారు.

కాగా, తాను సమైక్యవాదినని జగన్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక కోస్తా, ప్రత్యేక రాయలసీమ వాదాలను తాను సమర్థించబోనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత సంక్షోభానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కారణమని ఆయన విమర్శించారు. తాను తెలుగుదేశం సభ్యులకు మద్దతు పలకలేదని ఆయన స్పష్టం చేశారు. తాను బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాను గానీ ప్రత్యేక తెలంగాణ కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు మాట మార్చాయని ఆయన తప్పు పట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X