ఆ పని దేవుడు కూడా చేయలేడు: జెపి

రాష్ట్రంలో 41 శిబిరాల్లో చేస్తున్న దీక్షలను సామాన్యులు విరమించుకోవాలని, రాజకీయ నాయకులు ఆడుతున్న క్రీడలో బలిపశువులు కావద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఉత్తములు సామాన్యులుగా, దుర్మార్గులు బలవంతులుగా మారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న ఉన్మాద వాతావరణ పోయి సాధారణ పరిస్థితులు నెలకొనడం అవసరమని ఆయన చెప్పారు. సమస్యను కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉంటుందని, ఇందుకు అవసరమైన ప్రకటన చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ క్రీడలో ఒకరి గెలుపు ఒకరి ఓటమి సాధ్యం కాదని ఆయన అన్నారు. రాజకీయ నాయకులకు కీర్తీ వస్తుందనీ వారి ఆరోగ్యం కుదుటపడుతందని, నష్టపోయేది సామాన్యులూ విద్యార్థులేనని ఆయన అన్నారు. పత్రికలు, టీవీలు కూడా సాధారణ వాతావరణానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత స్థితి వల్ల రాష్ట్రం దెబ్బ తింటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications