లగడపాటి రాజగోపాల్ ఆమరణ దీక్ష భగ్నం

Lagadapati Rajagopal
విజయవాడ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు శుక్రవారం ఆర్థరాత్రి భగ్నం చేశారు. ఆయనను ఆస్పత్రికి తరలించారు. తొలుత ఆయన పోలీసులతో మామూలుగానే వెళ్లినప్పటికీ తర్వాత ప్రతిఘటించడానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు బలవంతంగా ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే లగడపాటి చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు. లగడపాటి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన చెప్పారు.

లగడపాటి రాజగోపాల్ అరెస్టును నిరసిస్తూ మాజీ మండలి బుద్ధప్రసాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో బుద్ధప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ ఆధ్వర్యంలో కూడా రాస్తారోకో జరిగింది. ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగడపాటికి అరెస్టుకు నిరసనగా ఆదివారం సామూహిక సత్యాగ్రహం చేపడతామని మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయడం సరి కాదని ఆయన అన్నారు.

దీక్ష విరమించాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసి లగడపాటి రాజగోపాల్ ను కోరారు. అలాగే ముఖ్యమంత్రి కె.రోశయ్య కూడా లగడపాటి రాజగోపాల్ ను పరామర్శించారు. రాష్ట్ర విభజనను ఆపేస్తామని కేంద్రం ప్రకటించే వరకు తన దీక్ష కొనసాగుతుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+