వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్యకు శోభారాణి బెదిరింపు, అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Shobha Rani
హైదరాబాద్: సమైక్యాంధ్రపై కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లోగా నిర్ణయం ప్రకటించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాజరాజ్యం పార్టీ మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి హెచ్చరించారు. ఆ హెచ్చరిక చేసి ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఆమె విధించిన గడువు శనివారం ఉదయం 11 గంటలకు ముగియాల్సి ఉంది. అయితే ఈలోగా పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

తాను తెలుగుప్రజలంతా ఒక్క తాటి మీది నిలబదడాలనేదే తన ఉద్దేశమని ఆమె చెప్పారు. కలసి ఉంటేనే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. విడిపోతే కూలిపోతామని ఆమె అభిప్రాయపడ్డారు. తాను నిరాహార దీక్ష చేస్తున్నా ఒక్కరు కూడా ఫోన్ చేయలేదని ఆమె నిష్టూరమాడారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న కెసిఆర్ ను పలు మార్లు పరామర్శించి ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికిన శోభారాణి తమ నాయకుడు సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో తన వైఖరిని మార్చుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X