వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం నిర్ణయం మార్చుకోవచ్చు: రఘువీరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తన నిర్ణయం మార్చుకోవచ్చునని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం లాంటిది తన 52 ఏళ్ల జీవితంలో చూడలేదని, 8 రోజులుగా బంద్ పాటిస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొందరు వక్రీకరిస్తున్నారని, వారి వ్యాఖ్యలు సరి కావని ఆయన అన్నారు. ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చిందని ఆయన చెప్పారు.

తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని, మంత్రిగా ఉన్నందువల్ల లక్ష్మణరేఖ దాటడం లేదని ఆయన చెప్పారు. ప్రధాని త్వరగా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అభివృద్ధి దెబ్బ తింటుందని ఆయన అన్నారు. ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఆయన శనివారంనాడు ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X