వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ప్రక్రియ మొదలైంది: పొన్నాల లక్ష్మయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ఆయన ఢిల్లీ నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడిన తర్వాత అన్ని చక్కబడుతాయని ఆయన అన్నారు. ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

పొన్నాల లక్ష్మయ్య ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) అధికారులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే విషయంపై ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన ఇతర ప్రాజెక్టులపై కూడా ఆయన చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన జల పంపకాలపై సిడబ్ల్యుసి జరుపుతున్న సమాచార సేకరణలో భాగంగా కూడా పొన్నాల లక్ష్మయ్యతో కేంద్ర జల సంఘం అధికారులు మాట్లాడినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X