వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విభజనపై రేపు పిఎం ప్రకటన: కావూరి
ప్రకటన చేయడంలో ఒక రోజు ఆలస్యమైనా నష్టం తీవ్రంగా ఉంటుందని తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానికి చెప్పామని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్వచ్ఛందంగా ఉద్యమాలు, ఆందోళనలు సాగుతున్నాయని వివరించామని ఆయన చెప్పారు. తెలంగాణలో సంబరాల వల్ల సీమాంధ్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొని ఉన్నాయని ఆయన అన్నారు. ఏ ప్రాంతానికి కూడా నష్టం జరగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం ఉంటుందని ఆయన ఆశించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని తమకు ప్రధాని సూచించినట్లు చింతా మోహన్ చెప్పారు.
Comments
Story first published: Monday, December 21, 2009, 13:49 [IST]