రాజీనామాలకు వంద ఎమ్మెల్యేలు: కెసిఆర్
తెలంగాణ ప్రజల సహనానికి పరీక్ష పెట్టద్దని ఆయన హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షిస్తే అణు విస్ఫోటం సంభవిస్తుందని ఆయన అన్నారు. ఆరు నూరైనా, తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయించినా పట్టు విడవకూడదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు భౌగోళికమైన ఇబ్బందులేమీ లేవని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలకు పొసగలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ మా మేనమామది కాకపోతే మీ మేనమామదా అని ఆయన మోహన్ బాబును అడిగారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి దశ, దిశ లేదని, ఉమ్మడి లక్ష్యం లేదని, ఉమ్మడి నాయకుడు లేడని ఆయన తప్పు పట్టారు. లగడపాటి జగడం, కాంగ్రెసు, తెలుగుదేశం ఎవరి దారి వారిదేనని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజల ఇక్కట్లను, తెలంగాణకు జరిగిన మోసాలను ఆయన వివరించారు. మీకు బలం ఉంటే నాకు బలగం ఉందని ఆయన కోస్తాంధ్ర, రాయలసీమ నేతలను ఉద్దేశించి అన్నారు. తమకు ఏమీ తెలియదనే పద్ధతిలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. స్వతంత్రమే అర్థరాత్రి వచ్చిందని, సమైక్యాంద్ర ఎందుకంటే చెప్పే పరిస్థితి లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఎందుకంటే చిన్న పోరగాళ్లు కూడా చెప్తారని ఆయన అన్నారు.