వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ సంగతి తేల్చాలంటూ జెసి డిమాండ్

By Santaram
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్‌ : ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని మాజీ మంత్రి, రాయలసీమ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రోద్బలంతోనే సీమాంధ్ర నేతలు ఎవ్వరూ తమ పదవులకు రాజీనామా చేయలేదని ఆయన అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాము హైదరాబాద్‌ సంగతేంటని ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి అన్ని ప్రాంతాల వారి భాగస్వామ్యం ఉందన్నారు.

రాజకీయ లబ్ధి కోసం కొందరు ప్రత్యేక వాదులుగా తయారు అవుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. రాజకీయ ఆటకు అమాయకులు బలి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాలతో కాకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటుందని జేసీ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిందన్నారు. రోజుకు వంద కోట్ల నష్టం వాటిల్లుతుందని, వేల, కోట్ల ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. 70 శాతం మంది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని జేసీ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X