వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభేదాల ముచ్చట తర్వాత, తెలంగాణ సాధనే ముఖ్యం: కెసిఆర్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: విజయశాంతితో కానీ మరెవరితో కానీ విభేదాల విషయం ఇప్పుడు అప్రస్తుతమన్నట్టు కెసిఆర్ సెలవిచ్చారు. ప్రస్తుతం తమకి తెలంగాణ సాధనే ముఖ్యమని, విభేదాల మాట ఎత్తవద్దని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మీడియాని కోరారు. ఎంపి విజయ శాంతి చాలా రోజుల తరువాత ఈరోజు కెసిఆర్‌ ఇంటికి వెళ్లారు. కెసిఆర్‌తో ఆమె దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. అనంతరం వారిద్దరూ జెఎసి సమావేశానికి బయలుదేరుతూ విలేకరులతో మాట్లాడారు.

విజయశాంతితో విభేదాల విషయం విలేకరులు ప్రస్తావించగా, ఇప్పుడు విభేదాల విషయం ప్రస్తావించవద్దని కెసిఆర్‌ వారిని కోరారు. తమకు తెలంగాణ సాధనే ముఖ్యమని, గతంలో పార్టీ విడిచి వెళ్లినవారు వస్తే చేర్చుకుంటామని చెప్పారు. మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద రెడ్డి సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేసినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X