వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ఆఫీసులో తెలుగుదేశం తెలంగాణ నేతల భేటీ

By Santaram
|
Google Oneindia TeluguNews

TDP Leaders
హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలు ఆదివారం ఉదయం సమావేశం అయ్యారు. తెలంగాణకు మద్దతుగా చేపట్టనున్న బస్సుయాత్ర, జేఏసీ ఏర్పాటుపై చర్చ తదితర అంశాలపై వారు చర్చించనున్నారు. అలాగే భవిష్యత్‌ కార్యచరణపై ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును తెలంగాణ టీడీపీ నేతలు కలవనున్నారు.

నిన్న టిడిపి నేత నాగం జనార్ధనరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒప్పిస్తామని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వైఖరిని ప్రకటించిన మరు క్షణమే తమ నేత చంద్రబాబు ప్రకటిస్తారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై కాంగ్రెసుకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా తాము కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, తమ వైఖరి తెలంగాణపై మార్చుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లకు రహస్య ఎజెండా ఉందని, అందుకే తాము జెఎసిలో చేరడం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X