వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వసంత దిష్టి బొమ్మను దగ్ధం చేసిన సమైక్యవాదులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: రాష్ట్ర విభజనకు మద్ధతు పలుకుతున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద మాజీ మంత్రి వసంతనాగేశ్వరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, ఆంధ్ర ప్రాంతం వారిని ఇక్కట్లకు గురిచేస్తున్న తెలంగాణ నేతలతో వసంత ఢిల్లీ పర్యటించడం సిగ్గుచేటని టీడీపీ నేతలు విమర్శించారు.

ర్రాష్టాన్ని విభజించాలని కోరడమేగాక, హైదరాబాద్‌ సైతం అక్కర్లేదని వసంత వ్యాఖ్యాలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్‌, నల్లూరి ఉషారాణి, గోగినేని ధనశేఖర్‌, పోలవరపు చంద్రబాబు, యెర్నేని వేదవ్యాస్‌, ఉమ్మడి శ్రీనివాస్‌ యాదవ్‌, నూతలపాటి సాంబశివరావు తదితరులు ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్దకు చేరుకుని వసంత డౌన్‌డౌన్‌, సమైక్యాంధ్ర వర్థిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ, దిష్టిబొమ్మను దహనం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X