సాయంత్రం నరసింహన్ తో కెసిఆర్ భేటీ

కాగా, నరసింహన్ రాష్ట్ర పరిస్థితిపై ఇప్పటికే కేంద్ర హోం శాఖకు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి కె. రోశయ్య, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డిజిపి గిరీష్ కుమార్ లతో రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్ ఐపియస్ కేడర్ కు చెందిన నరసింహన్ తెలుగు బాగా మాట్లాడగలరు. ఆయన ఇంటెలిజన్స్ ఐజిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచేయడానికే ఆయనను గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం వేసిందనే ప్రచారం కూడా సాగుతోంది.












Click it and Unblock the Notifications