తివారీ పరువు తీసుకున్నారు: తెలంగాణ నేతలు

ND Tiwari
హైదరాబాద్: తనపై తెలంగాణ వేర్పాటువాదులు కుట్ర చేశారని ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ చేసిన ప్రకటనపై తెలంగాణ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తివారీ ఇప్పటికే పరువు తీసుకున్నారని, ఇటువంటి ప్రకటనల ద్వారా మరింత పరువు దిగజార్చుకుంటున్నారని కాంగ్రెసు ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తమకు రాష్ట్రపతి అపాయింట్ మెంటు ఇప్పించాల్సిన అవసరం లేదని, తాము అంత బలహీనులం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంటు ఇప్పించలేదని తనపై రాసలీల కుట్ర చేశారని తివారీ అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజలు అంత బలహీనులు, తెలివిహీనులు కారని ఆయన అన్నారు. తివారీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తివారీ కీర్తి మైనస్ జీరో జీరోకు దిగజారిందని ఆయన అన్నారు.

తివారీ ప్రకటన అర్థం లేనిదని మాజీ హోం మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె. జానారెడ్డి అన్నారు. తివారీ ఏం చేయాలో తోచక తెలంగాణవారిపై నిందలు మోపుతున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణవాదులకు రాష్ట్రపతిని కలవాల్సిన అవసరం లేదని, అందుకు తాము ఏ విధమైన విజ్ఞప్తి కూడా చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతోందనే నమ్మకం తమకు ఉందని, సాధ్యమైనంత త్వరగా అది ప్రారంభం కావాల్సి ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+