వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి వర్గ సమావేశానికి మేం దూరమే: జూపల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jupally Krishna Rao
హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తాము ముఖ్యమంత్రి కె. రోశయ్య నిర్వహించే మంత్రి వర్గ సమావేశాలకు దూరంగా ఉంటామని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు స్ఫష్టం చేశారు. ఈ విషయంపై తాము తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తమ వాదనలు వినిపించినట్లు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు స్పష్టం చేశఆరు. తాము రాజీనామాలు చేశామని, తాము ఇక ముందు మంత్రులం కాదని జూపల్లి కృష్ణారావు చెప్పారు. అందువల్ల తాము మంత్రి వర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉండదని ఆయన అన్నారు.

కాగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో తెలంగాణ మంత్రులు సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టత కావాలని, అందుకు తగిన కాల పరిమితి విధించాలని పార్టీ అధిష్టానాన్ని కోరడానికి ఆదివారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులు మంగళవారం తిరిగి వచ్చారు. తమ భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు వారు సమావేశం కానున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసిలో చేరాలా, వద్దా అనే విషయంపై ఆలోచన చేస్తామని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X