వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైలమాలో తెలంగాణ మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు డైలమాలో పడ్డారు. రేపు బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలా, వద్దా అనే విషయంపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టత, కాల పరిమితి కోసం ఢిల్లీ వెళ్లిన వారు మంగళవారం ఉదయం హైదరాబాద్ తిరిగి వచ్చారు. తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి వారు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెందిన కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ వంటి నేతలతో కలిశారు. తమ డిమాండ్ పై వారిని ఒప్పించేందుకు తెలంగాణ మంత్రులు తీవ్ర ప్రయత్నాలే చేశారు.

తెలంగాణపై తాము సానుకూలంగానే ఉన్నామని చెబుతూ రాజీనామాలు చేయడంపై తెలంగాణ మంత్రుల మీద అధిష్టానానికి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన తెలంగాణ మంత్రులు మంగళవారం జరిగే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసి సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. అయితే రేపటి మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలా, వద్దా అనే విషయంపై వారు డైలమాలో ఉన్నారు. మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోతే రాజీనామాలను ఆమోదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X