తెలంగాణపై రేపు మూడో ప్రకటన?

తెలంగాణ ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి తమపై వస్తున్న ఒత్తిడిని తెలంగాణ మంత్రులు మొయిలీకి వివరించారు. దీంతో మొయిలీ నుంచి వారికి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం ఉంది. దాంతో రేపు సాయంత్రానికి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాము ముందుగా తెలియజేయకపోయినా మొయిలీతో తమ సమావేశానికి అహ్మద్ పటేల్ కూడా రావడం ఆనందంగా ఉందని మంత్రులు చెబుతున్నారు. తాము రాజీనామాలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించామని, తమ పట్ల అహ్మద్ పటేల్, మొయిలీ సానుకూలంగా ప్రతిస్పందించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సమస్య పరిష్కార దిశగా వారు ఆలోచిస్తున్నట్లు పొన్నాల లక్ష్మయ్య మీడియా ప్రతినిధులతో చెప్పారు.
చిదంబరం రెండో ప్రకటన తెలంగాణ ప్రకటనపై తెలంగాణ ప్రాంతంలో అయోమయం, ఆందోళనలు చెలరేగాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టతను, కాల పరిమితిని ప్రకటించకపోతే ఆందోళనలు ఉధృతమవుతాయని తాము అహ్మద్ పటేల్ కు, మొయిలీకి చెప్పినట్లు ఆయన తెలిపారు. వారు సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన చెప్పారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications