వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై తెరాస 'ప్ర్తత్యేక' వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి)లో కొనసాగుతూనే తనదైన ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఉన్న తమ ఆస్తుల వల్లనే కొద్ది మంది రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నారనే అభిప్రాయం తెరాసలో ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి తెరాస నాయకత్వం ఆ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెరాస నాయకుడు హరీష్ రావు సోమవారం చేసిన ప్రసంగాన్ని అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. హైదరాబాదులో ఆస్తులు కూడగట్టున్న కొద్ది మంది బడా కోస్తాంధ్ర పెద్దలను గుర్తించి వారు అభద్రతకు గురయ్యే పరిస్థితులు కల్పించాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది.

సమైక్యవాద నినాదం వినిపించిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు హరీష్ రావు సవాళ్లు విసిరారు. దమ్ముంటే ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు రావాలని ఆయన వారిని సవాల్ చేశారు. సమైక్య నినాదంతో దమ్ముంటే తెలంగాణలో తిరగాలని కూడా ఆయన అన్నారు. అదే సమయంలో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు హెచ్చరికలు చేశారు. తెలంగాణకు చెందిన అధ్యాపకుల పట్ల వివక్ష ప్రదర్శిస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ఈ రకంగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదులో ఆస్తులు కూడబెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు అభద్రతకు గురయ్యే పరిస్థితిని కల్పించాలనేది తెరాస వ్యూహంగా కనిపిస్తోంది.

నిజానికి, తెలంగాణేతర ప్రాంతాలవారి హైదరాబాద్ ఆస్తులకు ఏ విధమైన నష్టం ఉండదని, వాటిని కాపాడే బాధ్యత తమదని తెరాస మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. కానీ, వారి మాటలను పట్టించుకోకుండా సమైక్యవాదం పేర కొద్ది మంది తమపై దాడికి దిగడాన్ని తెరాస సీరియస్ గా తీసుకుని, ప్రతిదాడికి దిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రతిదాడిలో భాగంగానే తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X