వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెజవాడ బిజెపి ఆఫీసుపై కాంగ్రెసు దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna Barrage
విజయవాడ: జై ఆంధ్ర ఉద్యమం కోసం సమాయత్తవుతున్న సమయంలో విజయవాడలో బిజెపి కార్యాలయాన్ని సమైక్యవాదులు మంగళవారం చుట్టుముట్టారు. బిజెపి నాయకుడు కంభంపాటి హరిబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా వారు అడ్డుకున్నారు. సమైక్యనినాదాలు చేస్తూ బిజెపి కార్యాలయాన్ని కొద్ది మంది చుట్టుముట్టారు. ఈ సమయంలో సమైక్యవాదులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. సమైక్యవాదులను కుర్చీలతో ఎదుర్కునేందుకు బిజెపి కార్యకర్తలు సమాయత్తమయ్యారు. దాడి చేసినవారు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మనుషులని గుర్తించారు.

బిజెపి కార్యాలయంలోని ఫర్నీచర్ ను సమైక్యవాదులు ధ్వంసం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తమపై సమైక్యవాదుల పేర కిరాయి మనుషులు దాడి చేయడానికి ప్రయత్నించారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చి తమ మీదికి కొద్దిమందిని ఉసిగొల్పారని వారంటున్నారు. ఈ దాడిలో ఒక యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని అస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కొంత మంది సమైక్యవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సమైక్యవాదులకు అవగాహన లేదని, అందుకే అలా చేస్తున్నారని బిజెపి నాయకులు అన్నారు. తమ అంతర్గత సమావేశంపై దాడి చేయడం మాట్లాడే హక్కును హరించడమేనని, తమ అబిప్రాయాలను వెల్లడించుకునే హక్కు తమకు ఉందని వారంటున్నారు. తమపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలని బిజెపి డిమాండ్ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X