బెజవాడ బిజెపి ఆఫీసుపై కాంగ్రెసు దాడి
బిజెపి కార్యాలయంలోని ఫర్నీచర్ ను సమైక్యవాదులు ధ్వంసం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తమపై సమైక్యవాదుల పేర కిరాయి మనుషులు దాడి చేయడానికి ప్రయత్నించారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చి తమ మీదికి కొద్దిమందిని ఉసిగొల్పారని వారంటున్నారు. ఈ దాడిలో ఒక యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని అస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కొంత మంది సమైక్యవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సమైక్యవాదులకు అవగాహన లేదని, అందుకే అలా చేస్తున్నారని బిజెపి నాయకులు అన్నారు. తమ అంతర్గత సమావేశంపై దాడి చేయడం మాట్లాడే హక్కును హరించడమేనని, తమ అబిప్రాయాలను వెల్లడించుకునే హక్కు తమకు ఉందని వారంటున్నారు. తమపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలని బిజెపి డిమాండ్ చేసింది.