వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాఘా సరిహద్దు వద్ద పాక్ రాకెట్ల దాడి

|
Google Oneindia TeluguNews

Amristar
అమృతసర్: పాకిస్తాన్ భారత్ పై కవ్వింపు చర్యలకు దిగింది. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతం వాఘా సమీపంలో అటారీపై పాకిస్తాన్ దళాలు శనివారం ఉదయం రాకెట్ల దాడికి దిగాయి. ఈ దాడిని భారత భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ మొత్తం ఐదు రాకెట్లను ప్రయోగించింది. అయితే ప్రాణ నష్టమేమీ సంభవించలేదని అధికారులు చెప్పారు. జమ్మా - కాశ్మీర్ సరిహద్దు వద్ద కూడా పాక్ బలగాలు భారత్ చెక్ పోస్టులపై కాల్పులకు దిగుతున్నాయి. దీంతో సరిహద్దు వెంబడి భారీగా భారత సైనిక, బిఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి.

శనివారం తెల్లవారు జామున 2, 3 గంటల మధ్య అటారీ వద్ద పాక్ బలగాలు రాకెట్ల దాడికి తెగబడ్డాయి. బిఎస్ ఎఫ్ అధికారులు పాకిస్తానీ రేంజర్స్ తో మాట్లాడి తీవ్ర నిరసన తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారి సింగ్ చెప్పారు. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో రాకెట్ల దాడికి దిగడం ఇది మూడో సారి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X