వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీపై రిలయన్స్ ప్రేమ: ఉండవల్లి అరుణ్ కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
హైదరాబాద్: ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉన్న అంబానీ గ్రూప్ ఈనాడులో ఎందుకు పెట్టవలసి వచ్చిందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అంబానీ గ్రూప్ లూజ్ గా ఏ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టదని, ఒక్క ఈనాడులోనే పెట్టుబడులు పెట్టిందని ఆయన సాక్షి టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. లక్ష్మీపార్వతిని అన్ పాపులర్ చేసింది, ఎన్టీఆర్ కు పచ్చెక్కిందని సంపాదకీయాలు రాసింది ఈనాడు పత్రికేనని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ ను గద్దె దింపి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకు రావడానికి ఈనాడు ఈ రాతలన్నీ రాసిందని ఆయన విమర్శించారు.

రిలయన్స్ ఆస్తులపై రాయి వేయగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పందించిన తీరు చూస్తుంటే వారి మధ్య గల సంబంధం తెలిసిపోతోందని ఆయన అన్నారు. ఈ సంబంధంపై కూడా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల రోజులుగా రాష్ట్రం అట్టుడికిపోతుంటే మాట్లాడని చంద్రబాబు రిలయన్స్ కార్యాలయాల మీద దాడి జరగగానే తీవ్రంగా స్పందించారని, అలా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X