వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీట్లో కూర్చున్న లగ్నం బాగుండలేదేమో: రోశయ్య నిర్వేదం

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: 'నేను సీట్లో కూర్చున్న లగ్నం బా గాలేదేమో.. మీరు నమ్మకపోవచ్చు.. వచ్చినప్పటి నుంచీ అన్నీ సమస్యలే.. ఒకదాని వెంట ఒకటిగా వస్తున్నాయి..వైఎస్‌ మృతి సంఘటనపై కూడా ఎన్ని వాదనలొస్తున్నాయో చూస్తున్నారు కదా..' ముఖ్యమంత్రి రోశయ్య ఉద్యోగసంఘాల జేఏసీ నేతలతో ఇలా వ్యాఖ్యానించారు. పీఆర్సీపై చర్చల కోసం వారు కలిసి సమయంలో రోశయ్య నిర్వేదంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

'రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేప«థ్యంలో తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్నాను. అందుకోసం మీకు ఎక్కువ సమయం కేటాయించ లేకపోతున్నాను. అలా అని ఉద్యోగుల డిమాండ్లు, పీఆర్సీల నుంచి తప్పుకోవడంలేదు. కమిటీల పేరుతో కాలయాపన చేసే ఉద్దేశం లేదు. ఆర్థిక పరిస్థితి సహా అన్ని విషయాలూ మీకు తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి' అని కోరారు.

ఇందుకు జేఏసీ నేతలు బదులిస్తూ.. గత నెల రోజులుగా జరుగుతున్న సంఘటనలకు ఉద్యోగులతో ముడిపెట్టవద్దని కోరారు. ఇప్పటికే ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నందున పీఆర్సీపై ఇక కాలయాపన చేయొద్దని కోరారు. సంక్రాంతికి ముందే పీఆర్సీ ఇవ్వాలని విఙ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం బదులిస్తూ పీఆర్సీ విషయమై 18, 19 తేదీల్లో పూర్తి సమయాన్ని కేటాయిస్తానని, దీనిపై నిర్ణయం కచ్చితంగా ఖరారవుతుందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X