ఆంధ్రా హీరోల సిన్మాలను అడ్డుకోవడం అన్యాయం: చిరంజీవి
నర్సాపురం వైఎన్ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సోమవారం సాయంత్రం కళాశాల అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన రోడ్డు మార్గం గుండా నర్సాపురం బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు. నర్సాపురం కాలేజిలో ఆరుగంటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం తాడేపల్లిగూడెం నుంచి రైలులో హైదరాబాద్ వెళతారు.
నరసాపురం నియోజకవర్గం మొగల్తూరులో జన్మించిన చిరంజీవి 1973 నుంచి 75 వరకు వైఎన్ కళాశాలలో బీకాం విద్యనభ్యసించారు. ఆ కళాశాల ఎన్సీసీ విద్యార్థిగా ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్డే పెరేడ్లో పాల్గొని ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్నారు. సినీరంగ ప్రవేశం చేసిన చిరంజీవి జాతర సినిమా షూటింగ్ సందర్భంగా కృష్ణంరాజుతో కలిసి కళాశాలకు వచ్చారు. 2000 సంవత్సరంలో కళాశాల గోల్డెన్జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఆనాటి వేడుకలకు డుమ్మా కొట్టారు. అలాగే 2003లో శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా వందరోజుల వేడుకలు కళాశాల ఆవరణలో నిర్వహించినా చిరంజీవి హాజరుకాలేదు.
ఆనాటి వేడుకల్లో చిరంజీవి మాట్లాడిన ప్రసంగం సీడీ ద్వారా ప్రేక్షకులకు వినిపించారు. రాజకీయ నాయకునిగా ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ప్రజా అంకితయాత్రలో భాగంగా 2009లో కళాశాలను చిరంజీవి సందర్శించి గతకాలం జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కళాశాల వజ్రోత్సవ వేడుకల ముగింపు రోజు సోమవారం జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు.