వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాలో చీలిక తెచ్చే ప్రయత్నం: దామోదర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: కొంత మంది తమ తెలంగాణ నాయకుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెసు కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు చేసిన వ్యాఖ్యపై ఆయన ఆ విధంగా అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిదులు, నాయకుల సమావేశానంతరం ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ నాయకులను కొంత మంది ప్రలోభపెడుతున్నారని, అయినా తాము చీలిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం తమను రాజీనామాలు చేయాలని అడిగిందా అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. తాము రాజీనామాలను వెనక్కి తీసుకోలేదని ఆయన చెప్పారు. ఏ నిర్ణయమైనా రేపటి జెఎసి సమావేశంలో తీసుకుంటామని, ఉమ్మడిగానే తెలంగాణ ప్రాంత నాయకులు నిర్ణయాలు తీసుకుంటారని ఆయన చెప్పారు.

రేపటి రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి అత్యంత కీలకమైన సమావేశమని, ఈ సమావేశానికి తెలంగాణ నాయకులంతా హాజరు కావాలని ఆయన అన్నారు. జెఎసిలో చర్చించి రేపు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ ప్రధానితో భేటీ వివరాలపై కూడా సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సూచించారని, దానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని సీమాంధ్ర నాయకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని, దాంతో వారు జలాలు, ఇతర విషయాలపై నిపుణుల కమిటీ వేసుకుని చర్చించుకుంటున్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. అన్నదమ్ముల్లా విడిపోదామని ఆయన సీమాంధ్ర నాయకులకు సూచించారు. సీమాంధ్ర నాయకులు, ప్రజలు సంక్రాంతి పర్వదినానికి తమ తమ ప్రాంతాలకు వెళ్లి సంతోషంగా తిరిగి రావాలని ఆయన ఆశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X