వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ కామపిశాచి ధన్ రాజ్ పై పిఆర్పీలో చర్చ

|
Google Oneindia TeluguNews

Dhanaraj
విశాఖపట్నం: అమాయక మహిళలను మభ్యపెట్టి శారీరకంగా లొంగదీసుకునే నైజం గల ధనరాజ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్టుకు ఎవరు సిఫారసు చేశారనే అంశంపై ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీలో తీవ్ర చర్చ అయింది. 'మధనకామరాజ్‌' పేరిట శని, ఆదివారాల్లో ఆధ్రజ్యోతి/ ఏబీఎన్‌ ఛానళ్లలో వెలువడిన కథనాలు సంచలనం సృష్టించాయి. ఇంతటి నేర చరిత్ర గల వ్యక్తి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధపడడం, కనీస పరిశీలన జరపకుండా 'సామాజిక న్యాయం' అంటూ ప్రారంభమైన ప్రజారాజ్యం పార్టీ అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయించడం పట్ల అదేపార్టీలోని నాయకులు ధ్వజమెత్తారు.

ధనరాజ్‌కు టిక్కెట్టు ఇవ్వమంటూ పార్టీ అధినేత చిరంజీవిపై ఒత్తిడి తెచ్చిన పెద్దలు ఇప్పుడేమంటారు? అంటూ ప్రరాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గెడ్డం బుజ్జి నిలదీస్తున్నారు. విశాఖజిల్లాలో టిక్కెట్లు కేటాయింపులో అర్హులకు అన్యాయం జరిగిందన్న విషయం ఇప్పటికైనా చిరంజీవి తెలుసుకోగలుగుతారని మరికొందరు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనంతరం జిల్లాలో పార్టీ స్థితిగతులపై సమీక్ష జరగకపోయినా, ధనరాజ్‌ బండారం బట్టబయలు కావడంతో పాపప్రక్షాళనకు ఆపార్టీ నాయకులు సిద్ధమయ్యారు. నియోజకవర్గ కేంద్రమైన పాయకరావుపేటలోని ప్రరాపా కార్యాలయాన్ని ఆపార్టీ నాయకులు ఆదివారం పాలతో శుద్ధిచేయడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X