వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చార్జీలపై ధర్నా: వామపక్ష నేతల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: ఆర్టీసి బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు సోమవారం హైదరాబాదులోని బస్ భవన్ వద్ద ధర్నాకు దిగాయి. ఆ సందర్భంగా పోలీసులు సిపిఐ, సిపిఎం నాయకులను, కార్యకర్తలను ఆరెస్టు చేశారు. అరెస్టయినవారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సిపిఎం పార్లమెంటు సభ్యుడు పి. మధు ఉన్నారు. వారిని అరెస్టు చేసే సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అరెస్టుచేసి గాంధీనగర్ పోలీసు స్టేషనుకు తరలించారు.

కాగా, పెంచిన చార్జీలు తగ్దించే వరకు తమ ఉద్యమం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ హెచ్చరించారు. ప్రభుత్వం ఆర్టీసి బస్సు చార్జీల పెంపు ద్వారా సామాన్యులపై భారం వేయడాన్ని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం పతన దిశలో సాగుతోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆర్టీసి చార్జీల పెంపుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఆర్టీసిని లాభాల్లో నడపడం ఎలానో తాము చెబుతామని మధు అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని ఆయన అన్నారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్టం రావణ కాష్టంలా మండుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X