వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు వ్యాపారులను చంపిన మావోలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
విజయనగరం: ఇద్దరు వ్యాపారులను మావోయిస్టులు నరికి చంపారు. గొంతు కోసి మావోయిస్టులు వ్యాపారులను హత్య చేశారు. ఈ సంఘటన ఒరిస్సాలోని బందుగావ్ బ్లాక్ లో జరిగింది. ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దులో గత రాత్రి మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృతులు విజయనగరం జిల్లాలోని కత్తులపేకు చెందినవారు. పోలీసు ఇన్ ఫార్మర్లుగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు వారిని హత్య చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే బందుగావ్ బ్లాకులో కొంత మంది వ్యాపారులు వేయి ఎకరాల భూములు కొన్నారు. వారి భూములను మావోయిస్టులు సొంతం చేసుకుని, గిరిజనులకు పంచినట్లు తెలుస్తోంది. ఆ భూముల్లోకి రావద్దని వ్యాపారులను మావోయిస్టులు హెచ్చరించారని, వారి హెచ్చరికలను ఖాతరు చేయకపోడంతో మావోయిస్టులు ఆ ఇద్దరు వ్యాపారులను హత్య చేశారని అంటున్నారు. కాగా, ఖమ్మం జిల్లా చర్ల మండలం పులిగుండాల అటవీ ప్రాంతంలోని ప్రొక్లెయిన్, ట్రాక్టర్లను మావోయిస్టులు దగ్ధం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X