వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు లిపి గ్రంధాన్ని ఆవిష్కరించిన రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాదు: తెలుగు లిపికి సంబంధించి తెలుగు స్క్రిప్ట్‌ అనే పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఆవిష్కరించారు. తెలుగు లిపి ఎలా అభివృద్ధి చెందింది, ఆ అభివృద్ధికి ఎంతమంది ఏవిధంగా శ్రమించారనేది ఈ పుస్తకంలో చక్కగా పొందుపరచడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలుగు లిపి ప్రాముఖ్యాన్ని వివరించే ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మూడో శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు వివరాలను పొందుపర్చిన ఈ పుస్తకాన్ని పరబ్రహ్మశాస్త్రి, రామచంద్రమూర్తి రచించారు.

అంతకు ముందు రోశయ్య జూబిలీహిల్స్ లో రోశయ్య భారతీయ సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. భారతీయ, తెలుగు చిత్ర పరిశ్రమలకు రఘుపతి వెంకయ్య నాయుడు ఆద్యుడు. భారత్‌లో మొదటి టాకీ, మూకీ సినిమాలను నిర్మించిందీ ఆయనే. మద్రాస్‌లోని మొదటి థియోటర్‌ యాజమాని, దక్షిణాది చిత్రపరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన ఆయన తెలుగువారు కావడం మనకు గర్వకారణం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X