వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెజవాడ- హైద్రాబాద్ మధ్య బస్సుల బారులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Apsrtc Bus
విజయవాడ: సంక్రాంతి తిరుగు ప్రయాణాల కారణంగా ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ చరిత్రలోనే లేని విధంగా ఆదివారం రికార్డు స్థాయిలో 300 బస్సులు రాజధానికి బయలుదేరి సంచలనాన్ని సృష్టించాయి. కిందటేడాది సంక్రాంతి పండుగ తిరుగు ప్రయాణాల మూడవ రోజున అత్యధికంగా 120 స్పెషల్‌ బస్సులు రాజధానికి బయలు దేరి వెళ్ళాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆదాయాన్ని సృష్టించిన రోజు అది. ఈ సారి కిందటి సంవత్సరం రికార్డును బద్దలు కొడుతూ, ఏకంగా 150 స్పెషల్‌ సర్వీసులు హైదరాబాద్‌ వెళ్ళాయి. ఈ బస్సులు సోమవారం సాయంత్రానికి తిరిగి వస్తాయి.

ఆదాయార్జనలో కిందటేడాది రికార్డును బద్దలు కొట్టటమే కాకుండా అత్యుత్తమ అదాయ సగటు నమోదౌతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి తిరుగు ప్రయాణాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఆర్టీసీ అధికారులు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేపట్టారు. 17వ తేదీన ముందుగా 60 షెడ్యూల్‌ బస్సులు నడపాలని అనుకున్నారు. ఆదివారంతో సెలవులు ముగుస్తాయి కాబట్టి తిరుగు ప్రయాణాలకు వెళ్ళేవారు చాలామంది ఇదేరోజును ఎంచుకున్నారు.

ఈ ప్రయాణానికి నెల రోజుల క్రితమే రిజర్వేషన్‌ అయిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా మరిన్ని బస్సులను అధికారులు సిద్ధం చేసుకోవటంతో ఇబ్రహీంపట్నం, గవర్నర్‌ పేట-2, ఆటోనగర్‌ డిపోల నుంచి సిటీ బస్సులు సైతం తెప్పించి హైదరాబాద్‌కు పంపారు. పీఎన్‌బీఎస్‌ వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ఆర్డినరి, సిటీ బస్సులను స్పెషల్స్‌గా వేసినా వాటిలోనైనా టిక్కెట్లు దక్కించుకోవాలని ప్రయాణికులు ఆతృత పడ్డారు. బుకింగ్‌ కౌంటర్‌ కూడా కిటకిటలాడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X