వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ వచ్చి వేదమంత్రాలతో పెళ్ళి చేకునున్న స్పెయిన్ జంట

By Santaram
|
Google Oneindia TeluguNews

Spanish Couple
విశాఖపట్నం: భారతీయ కుటుంబ వ్యవస్థకు ఆకర్షితులైన స్పెయిన్‌కు చెందిన యువకుడు జాన్‌, యువతి ఇవాలు హిందూ సంస్కృతి, సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. జగద్గురు పీఠం ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ కృష్ణనగర్‌లో ఈ జంటకు వివాహం వైభవంగా జరిగింది. పీఠం గురు పూజల్లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన జాన్‌, ఇవాలు వేద మంత్రాల సాక్షిగా తమ వివాహాన్ని జరిపించాలని పీఠం అంతర్జాతీయ అధ్యక్షుడు కె.పార్వతీకుమార్‌ను అభ్యర్థించారు. దీంతో కృష్ణనగర్‌లోని పీఠం మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంగ్లంలో వేద మంత్రాలు చదవగా పార్వతీకుమార్‌ స్వయంగా వివాహాన్ని జరిపించారు.

వృత్తి రీత్యా సైకాలజిస్టులైన ఈ జంట, భారతీయ కుటుంబ వ్యవస్థలో ప్రేమానురాగాలు, ఆత్మీయతలు తమను ప్రభావితం చేశాయని వివాహం అనంతరం విలేఖరులకు చెప్పారు. శ్రీరామ చంద్రుడి ఏకపత్నీ వ్రతం, ధర్మనిష్ట వంటివి తమకెంతో స్ఫూర్తినిస్తుంటాయని అన్నారు. వివాహ వేడుకకు వధూవరుల తల్లిదండ్రులతో పాటు 90 మంది విదేశీయులు, విశాఖ నగర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X