అప్పుడు ఒక్కడినే, ఇప్పుడు ఉప్పెన: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో పదేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమంలో తానొక్కడినేనని, ఇప్పుడు ఉప్పెనలా ప్రజలు ముందుకు వస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. ఉద్యమంలో ఎవరు ఎవరికీ బాస్ లు కారని, ప్రజల తమ హైకమాండ్ అని, వేరే హైకమాండ్ లు లేవని, అందుకే తాను చొరవ తీసుకుని కాంగ్రెసు నాయకుడు జానా రెడ్డి వద్దకు వెళ్లానని ఆయన అన్నారు. ప్రజారాజ్యం అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్ ఆదివారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.

ఈ నెల 28వ తేదీ లోగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే 29వ తేదీన రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి క్యూ కడతామని ఆయన చెప్పారు. డిజిపి వ్యాఖ్యలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్లే లేరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే వస్తారన్నట్లుగా ఉందని ఆయన అన్నారు. కోస్తాంధ్రలో లగడపాటి రాజగోపాల్ దీక్షకు దిగితే నన్నపనేని రాజకుమారి ముద్దు పెట్టారని, దేవినేని ఉమామహేశ్వర రావును పరామర్శించారని, అక్కడ అందరూ ఏకమవుతున్నారని, తెలంగాణలో కూడా అందరూ ఏకం కావాలని ఆయన అన్నారు. సంక్షోభ సమయంలో శత్రువును ఎదుర్కునేందుకు తెలంగాణ బిడ్డలు ఏకమవుతారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+