వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూగో జిల్లాలో ప్రజారాజ్యానికి పలువురి రాజీనామాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Prajarajyam
రాజానగరం(తూగో జిల్లా): ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన తమకు కలుగుతున్న ఆశాభంగం వల్ల రాజీనామాలు చేస్తున్నామని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు పేర్కొన్నారు. దివాన్‌చెరువులో సోమవారం నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఇన్‌చార్జి అక్కిరెడ్డి మహేష్‌ అధ్యక్షతన జరిగిన మండల పీఆర్పీ కార్యకర్తల సమావేశంలో వారు ఈ ప్రకటన చేశారు. కమిటీలను వేయకపోవడం శోచనీయమని పీఆర్పీ జిల్లా కన్వీనర్‌ సూరపురెడ్డి నారాయణస్వామి అన్నారు.

ప్రజారాజ్యం పార్టీకి గుడ్‌ బై చెప్పిన వారిలో ఆపార్టీ రాజానగరం నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఇన్‌చార్జి అక్కిరెడ్డి మహేష్‌, జిల్లా కన్వీనర్‌ సూరపురెడ్డి నారాయణస్వామి, మండల కన్వీనర్‌ వాసంశెట్టి పెదవెంకన్న ఉన్నారు. తుంగపాడు, దివాన్‌చెరువు ఎంపీటీసీ సభ్యులు కోలపాటి వెంకన్న, మల్లారపు సలోమి, మాజీ ఎంపీటీసీ బలిరెడ్డి అశోక్‌, మాజీ సర్పంచ్‌ బండి వీర్రాజు, ఉపసర్పంచ్‌లు కామిశెట్టి విష్ణు, గొల్లి అనంతలక్షీనారాయణ, జంపన రామభద్రరాజు, అబ్బిరెడ్డి వెంకటేశ్వరావు ఉన్నారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశమై ఏ పార్టీలో చేరేదీ నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X