గుమ్మడి మృతితో ఒంటరివాడినయ్యా: అక్కినేని నాగేశ్వర రావు

తెలుగు సినీ పరిశ్రమ యావత్తూ గుమ్మడికి నివాళులర్పించడానికి తరలి వచ్చింది. గుమ్మడి భౌతిక కాయం వద్ద సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ బోరున విలపించారు. జుమున, గిరిబాబు, పరుచూరి సోదరులు, మురళీమోహన్ , అలీ, ఆర్ నారాయణ మూర్తి తదితరులు గుమ్మడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా గుమ్మడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గుమ్మడి మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని ఆయన అన్నారు. తనకు గుమ్మడి 1972 ప్రాంతం నుంచి తెలుసునని, సత్ప్పవర్తన కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications