తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తా: చిరంజీవి

Chiranjeevi
గుంటూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ చుట్టూ తిరుగుతూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శించారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా పార్టీ తలపెట్టిన ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ధరలను స్థిరీకరించేందుకు 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసి చార్జీలు, వ్యాట్ పెంచడం దారుణమని ఆయన అన్నారు. ధరల పెరుగుదలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ధరల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కూడా తాము ఉద్యమాలు చేస్తామని, తెలంగాణ జిల్లాల్లో పర్యటనకు వెనకడుగు వేసేది లేదని ఆయన అన్నారు. తమ పార్టీ, తాను ప్రాంతాలకు అతీతంగా ప్రజాదరణ పొందామని ఆయన చెప్పారు. తమ పార్టీని పటిష్టపరిచే విషయంలో జాప్యం జరుగుతున్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. ఎన్నికల్లో ఎక్కువ మందిని గెలిపించుకోలేకపోయినంత మాత్రాన పార్టీ నీరు గారిపోయిందనుకోవడం సరి కాదని ఆయన అన్నారు.

తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట కల్తీసారా ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన విమర్శించారు. అంబాజీపేటలో కల్తీ సారా తాగి 15 మంది మృతి చెందారు. మరో 70 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుమ్మడి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన అన్నారు. గుమ్మడి మృతికి ఆయన సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+