వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల కొండపై దంపతుల ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుమల: తిరుమల కొండపై దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం కలిగించింది. కారులో వారిద్దరు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. వారిని పవన్, సుమతిలుగా గుర్తించారు. కొత్త కారులో వారు తిరుమల కొండపైకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఓ లేఖను రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ లేఖను బట్టి వారి పేర్లను గుర్తించారు. తాము జీవితంలో అన్నీ అనుభవించామని, తాము తిరుమల కొండపైనే చనిపోవాలని అనుకున్నామని, అందుకే ఇక్కడే చనిపోతున్నామని వారు రాశారు.

ఈ నెల 25వ తేదీన వారు తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత తమ కారులోనే ఆత్మహత్య చేసుకున్నారు. తమను తిరుమల కొండపైన శ్రీవారి సన్నిధిలోనే ఖననం చేయాలని వారు కోరారు. తమ మరణ వార్తను బంధువులకు చెప్పవద్దని వారు విజ్ఞప్తి చేశారు. తమ మరణ వార్తను కర్నాటక మీడియాలో వచ్చేలా చూడాలని వారు కోరుకున్నారు. వీరిని కర్నాటకకు చెందివారిగా భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X