వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూగో జిల్లాలో కల్తీ సారాకు 14 మంది బలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kakinada
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ సారా మహమ్మారికి 14 మంది బలయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా గంగులకుర్తి, పాలగుమ్మి, మొసలపల్లి గ్రామాల్లో కల్తీసారా తాగి సోమవారం ఏడుగురు మరణించారు. మంగళవారం సాయంత్రం మరో ఐదుగురు మరణించారు. బుధవారం ఉదయం మరో ఇద్దరు మరణించారు. దీంతో కల్తీసారాకు బలైన వారి సంఖ్య 14కు చేరుకుంది. ఇంకా 177 మంది దాకా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కల్తీసారా దుర్ఘటనపై ముఖ్యమంత్రి కె. రోశయ్య విచారణకు ఆదేశించారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. కల్తీసారా భూతం చుట్టుముట్టిన గ్రామాలకు వైద్య బృందాలను పంపారు. జిల్లా మంత్రులు సుభాష్ చంద్రబోసు, విశ్వరూప్, కలెక్టర్ ద్వివేది, ఎస్పీ నాగిరెడ్డి అమలాపురం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శనివారం సారా తాగిన వారంతా ఆస్పత్రుల్లో చేరాలని అధికారులు సూచించారు. మిథైల్ ఆల్కహాల్ సేవించడం వల్లనే మరణాలు సంభవించాయని కలెక్టర్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X