వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఉద్యమాలపై రాయపాటి అసహనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambhasiva Rao
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాలపై కాంగ్రెసు కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివర రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో భేటీ అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఎంతో కాలం ఆగామని అంటున్న తెలంగాణవాళ్లు మరో నెలరోజులు ఆగలేరా అని ఆయన అడిగారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇస్తుంటే ఇక ఆందోళనలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆందోళనలు, అలజడి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటే మాత్రమే తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. దౌర్జన్యాలు, ఆందోళనలతో ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రక్రియ అంటే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కాదని, తెలంగాణపై ప్రజాప్రతినిధులు, మేధావుల అభిప్రాయాలు తీసుకోవడమే తెలంగాణ ప్రక్రియ ప్రారంభం కావడమని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ఆ విధంగా చెప్పిందా అని అడిగితే తనతో ఆ విధంగా చెప్పలేదని, వారి ఆలోచన అలా ఉన్నట్లు తనకు అనిపిస్తోందని ఆయన సమాధానమిచ్చారు. ప్రజా ప్రతినిధుల రాజీనామాలు చేయడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి తెలంగాణ ప్రక్రియ వెనక్కి పోతుందని ఆయన అన్నారు. ఆందోళనల వల్ల, విద్యార్థుల ఆత్మహత్యల వల్ల ఒరిగేదేమీ లేదని, సాధారణ పరిస్థితులకు ప్రయత్నించడమే తెలంగాణ వాళ్లు చేయాల్సిన పని అని ఆయన అన్నారు. తెలంగాణపై సానుకూలత అంటే ఏమిటని అడిగితే అలా అన్న వారినే అదేమిటో అడగాలని ఆయన అన్నారు. తాను డిఎస్ ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X