వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పారామంలో రాసలీలలు టీవీలో ప్రసారం

By Santaram
|
Google Oneindia TeluguNews

Shilparamam
హైదరాబాద్‌: సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే హైదరాబాద్ శిల్పారామంలో ఉన్నతాధికారులు రాసలీలలకు పాల్పడడం ఆందోళనకు దారి తీసింది. శిల్పారామం స్పెషలాఫీసర్‌ జనార్దన్‌రెడ్డి రాసలీలపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ ప్రసారం చేసిన కథనానికి స్పందించిన మహిళా సంఘం నేతలు, స్థానికులు, పలు పార్టీల నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి శిల్పారామం వద్ద ఆందోళన నిర్వహించారు. స్పెషలాఫీసర్‌ జనార్దన్‌రెడ్డిని వెంటనే శిల్పారామం నుంచి తరిమికొట్టాలని నినదించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ రవీందర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ఉన్న ఓ అధికారి మహిళలను భయపెట్టి లోబర్చుకోవడం తగదన్నారు.

శిల్పారామంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలన్నారు. టీడీపీ హయాంలో శిల్పారామానికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని, జనార్దన్‌రెడ్డి రాకతో అవన్నీ పోయాయని విమర్శించారు. ఆయనను తక్షణమే తొలగించి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం మండల కార్యదర్శి శోభన్‌ మాట్లాడుతూ జనార్దన్‌రెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటివారిని క్షమించడం తగదన్నారు. ధర్నా చేస్తున్నవారిని మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీలం నందు, దేవేందర్‌, హుస్సేన్‌, అయిలేష్‌ యాదవ్‌, మధుయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కె.శ్రీనివాస్‌ రెడ్డి, శ్యాంమోహన్‌, రాజులతో పాటు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. జనార్దన్‌రెడ్డిపై ఏబీఎన్‌లో కథనం రావడంతో పోలీసులు శిల్పారామం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X